బోడుప్పల్ లోని సాయిరాం కాలనీలో విషాదం చోటు చేసుకుంది.ఆర్థిక ఇబ్బందులతో బాధ పడుతున్నదంపతులు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు.కడప జిల్లాకు చెందిన అక్షిత్(26), ఆయన భార్య చైతన్య(24) బతుకుదెరువు నిమిత్తం హైదరాబాద్కు వచ్చారు. మేడ్చల్ జిల్లాలోని బోడుప్పల్ సాయిరాం కాలనీలో నివాసం ఉంటున్నారు.
ఆర్థిక ఇబ్బందులే ఈ గటనకు కారణమని తెలుస్తుంది. ఈ దంపతులకు నెల రోజుల క్రితమే కుమార్తె జన్మించింది. పాప ఏడుపుతో విషయం గ్రహించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకొని, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు.