దుబ్బాక నియోజకవర్గ టి ఆర్ ఎస్ అభ్యర్థి సోలిపేట సుజాత బుధవారం సాయంత్రం మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి తో ముఖ్యమంత్రి కె .చంద్రశేఖర్ రావు ను కల్సి ధన్యవాదాలు తెలిపి ఆశీస్సులు తీసుకున్నారు.
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ సుజాత కు పార్టీ బి ఫామ్ అందజేశారు. పార్టీ కోసం, ప్రజల కోసం పాటు పడాలని జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను, చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు విస్తృతంగా ప్రచారం చేసి అత్యధిక మెజార్టీతో గెలవాలని సీఎం కేసీఆర్ చెప్పారు.
బీ ఫామ్ అందుకున్న సుజాత మాట్లాడుతూ దివంగత మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి కి ఇచ్చిన ప్రోత్సాహం ఆశీస్సులు అదేవిధంగా కొనసాగించాలని, మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెడుతాన్నారు.
కేసీఆర్ ఆశీస్సులతో ఎన్నికలో భారీ మెజారిటీతో గెలుస్తా నని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రిని కల్సిన వారి లో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ , రాష్ట్ర నాయకులు బక్కి వెంకటయ్య , రాజమౌళి పంతులు తదితరులు ఉన్నారు.