36.2 C
Hyderabad
April 23, 2024 21: 28 PM
Slider జాతీయం

21న సుక్మా, బీజాపూర్ జిల్లాల బంద్‌కు మావోయిస్టుల పిలుపు

#maoist

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో ముగ్గరు పౌరుల మరణానికి కారణం అయిన సిల్గేర్ కాల్పుల ఘటనకి నిరసనగా ఈనెల 21న సుక్మా, బీజాపూర్ జిల్లాల బంద్‌కి మావోయిస్టులు పిలుపునిచ్చారు.

ఆ మేరకు మావోయిస్టు పార్టీ దండకారణ్య దక్షిణ సబ్‌జోనల్ బ్యూరో పేరుతో ప్రకటన విడుదల చేశారు.

సిల్గేర్‌‌లో పెట్టిన సీఆర్‌పీఎఫ్ క్యాంపు ఎత్తివేయాలని ప్రజలు చేపట్టిన ఆందోళనలో చోటుచేసుకున్న కాల్పుల్లో ముగ్గురు మృతి చెందారు.

వారు మావోయిస్టు సభ్యులని ఇప్పటికే పోలీసులు ప్రకటించారు. అయితే ఈ ఘటనని మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది.

సిల్గేర్ క్యాంపు ఎత్తివేయాలని శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ప్రజలపై కాల్పులు జరిపి ముగ్గురి ప్రాణాలు పోవడానికి కారణమైన పోలీసు అధికారులపై హత్య కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు.

Related posts

బహుభాషా భారీ బడ్జెట్ చిత్రం సేవాదాస్ సెన్సార్ పూర్తి!!

Satyam NEWS

మోడీ విధానాలు త్రిప్పి కొట్టెందుకే….27 భారత్ బంద్….!

Satyam NEWS

కేసీఆర్ పాలనతో ప్రజలు నష్టపోయారు

Satyam NEWS

Leave a Comment