39.2 C
Hyderabad
April 23, 2024 16: 27 PM
Slider విజయనగరం

సుక్మా ఎన్ కౌంటర్ అమరుడు జవాన్ జగదీష్ మృతదేహం.. నగరానికి..!

#encounter

చత్తీస్ ఘడ్ రాష్ట్రం బీజ్ పూర్-సుక్మా సరిహద్దుల్లో జరిగిన కాల్పుల్లో వీరమరణం పొందిన సీఆర్పీఎఫ్ జవాన్ జగదీష్ కు యావత్ దేశం ముక్తకంఠంతో నివాళులు అర్పిస్తోంది.

ఈ మేరకు సదరు జవాన్ స్వస్థలం మైన విజయనగరం… భారత్ మాతాకీ జై అంటూ నినాదాలతో మారుమ్రోగింది. రోడ్డు మార్గం మీదుగా వ్యాన్ లో సీఆర్పీఎఫ్ బలగం..కమాండెంట్ ఆధ్వర్యంలో జవాన్ జగదీష్ మృతదేహం.. సాయంత్రం ఏడుగంటలకు చేరింది.

వేలాది మంది యువకుల మధ్య కోలాహలం తో నగరంలో కి జవాన్ జగదీష్ మృతదేహం ప్రత్యేక వాహనంలో చేరింది. ఎస్పీ ఆదేశాల మేరకు.. ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు ,సీఐ ఎర్రంనాయుడు‌,ఎస్ఐ లు భాస్కరరావు, జియాయుద్దీన్, ఏఎస్ఐ దాలినాయుడు ల బందోబస్తు మధ్య కలెక్టరేట్ జంక్షన్ నుంచీ గూడ్స్ షెడ్ ,సీఎంఆర్ ,రూరల్ పీఎస్, విజయనృ ఎమ్మార్వో ఆఫీసు మీదుగా గాజులరేగ చేరుకుంది.

అడగడుగున…జవాన్ జగదీష్ మృతదేహం… నగర ప్రజలు నినాదాలతో నివాళులు అర్పించారు. ఉదయాన్నే ఎస్పీ రాజకుమారీ.. గాజులరేగ లోని జవాన్ కన్నవాళ్లను కలిసి ఓదార్చారు.

సాయంత్రం అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ… సీఎంఆర్ జంక్షన్ వద్ద..నగర వన్ టౌన్ సీఐ మురళీ ,ఎస్ఐ దేవీలతో జవాన్ జగదీష్ మృతదేహానికి నివాళులు అర్పించారు.

అత్యంత కోలాహలం… భారత్ మాతాకీ జై అంటూ నగర ప్రజలంతా హోరెత్తించారు.

Related posts

జగన్ సర్కార్ కు హైకోర్ట్ లో మరోసారి చేదు అనుభవం

Satyam NEWS

భద్రాచలం ఏఎస్పీ గా పరితోష్ పంకజ్

Murali Krishna

మోదీ ప‌ర్య‌ట‌న‌.. స్వాగ‌తానికి సీఎం, గ‌వ‌ర్న‌ర్‌ల‌కు నిరాక‌ర‌ణ‌!

Sub Editor

Leave a Comment