శాస్త్రీయ, జానపద నృత్యం, సంగీతం, కోలాటం,చిత్రలేఖనం వంటి లలిత కళలను నేర్చుకునేందుకు ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని నాగర్ కర్నూలు జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ కోరారు. జిల్లాలోని అన్ని రకాల ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 5వ తరగతి నుండి 9వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ఈ నెల 16వ తేదీ నుంచి వచ్చేనెల 5వ తేదీ వరకు ప్రత్యేక వేసవి శిబిరాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. నాగర్ కర్నూలు పట్టణ కేంద్రంలోని రామాలయం వీధి ప్రాథమిక పాఠశాలలో ప్రత్యేక వేసవి శిబిరాన్ని ఈ నెల 16న ప్రారంభించనున్నట్లు తెలిపారు.
ప్రతిరోజు ఉదయం 8:00 గంటల నుంచి ఉదయం 10:00గంటల వరకు నైపుణ్యం, ప్రావీణ్యత కలిగిన అధ్యాపకులతో నిర్వహించనున్న ఈ శిక్షణ శిబిరంలో విద్యార్థిని విద్యార్థులకు శాస్త్రీయ నృత్యం, జానపద నృత్యం, పాటలు, బాలసభ కార్యక్రమాలు, కోలాటం, ఏకాగ్రత, స్వీయ క్రమశిక్షణ, యోగాసనాలు, ధ్యాన నైపుణ్యాలు, నాయకత్వ నైపుణ్యాలు, ఆత్మవిశ్వాసం, డ్రాయింగ్ సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలు నిష్ణాతులైన ఉపాధ్యాయులచే నేర్పించనున్నారు. ఆసక్తి గల బాలబాలికలు nagarkurnool.telangana.gov.in వెబ్సైట్ నందు తమ పేర్లను నమోదు చేసుకోవాలని లేదా ఉదయం నేరుగా శిక్షణ తరగతులు హాజరై తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. రేపు ఉదయం 8 గంటలకు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా శిక్షణ తరగతులు ప్రారంభించనున్నారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా