27.7 C
Hyderabad
April 25, 2024 09: 05 AM
Slider ఆధ్యాత్మికం

స్వయంభు శంభు లింగేశ్వర స్వామివారిని కిరణాలతో స్పృశించిన ఆదిత్యుడు

#sembhulingeswaratemple

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలోని స్వయంవ్యక్త శ్రీ ఇష్ట కామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయం లోని మూల మూర్తి ని ఆదిత్యుని కిరణాలు తాకాయి.

మహా శివరాత్రి ముందు అద్భుత దర్శనం ఇచ్చిన మెళ్ళచెరువు శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారిని సూర్య కిరణాలు ఆపాద మస్తకం సుమారు ఐదు నిమిషాల వరకు దర్శనం ఇచ్చాయి.

ఈ అద్భుత దృశ్యాన్ని శివ భక్తులు తమ చరవాణిలో బంధించారు. ప్రతి మహా శివరాత్రి ముందు ఈ అద్భుత దృశ్యం జరగడం విచిత్రమని,ఇటువంటి దృశ్యం అరుదైనదని,ఆలయ ప్రధాన అర్చకులు కొంకపాక శివ విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ తెలిపారు. ఆదిత్యుని కిరణాలు పరమశివుని స్పృశించటంతో అత్యంత ముగ్ధుడౌతాడని,తూర్పు పడమర సూర్య కిరణాలు నేరుగా శివలింగంపై పడడం ఒక్క మహా శివరాత్రి రోజు మాత్రమే చూడగలరని,అటువంటిది ముందుగానే శనివారం జరిగిన ఈ ఘటన చాలా శుభప్రదమైనదని ఆలయ అర్చకులు,భక్తులు భావిస్తున్నారు.

సత్యంన్యూస్, హుజూర్ నగర్

Related posts

శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

Bhavani

కరోనా రోగుల్ని దోచుకున్న డెక్కన్ ఆస్పత్రిపై చర్యలు

Satyam NEWS

అంబేద్కర్ ను అవమానిస్తే జూపూడికి పుట్టగతులుండవ్

Satyam NEWS

Leave a Comment