సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం మేళ్ళచెరువు మండల కేంద్రంలోని స్వయంవ్యక్త శ్రీ ఇష్ట కామేశ్వరీ సమేత శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారి దేవాలయం లోని మూల మూర్తి ని ఆదిత్యుని కిరణాలు తాకాయి.
మహా శివరాత్రి ముందు అద్భుత దర్శనం ఇచ్చిన మెళ్ళచెరువు శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి వారిని సూర్య కిరణాలు ఆపాద మస్తకం సుమారు ఐదు నిమిషాల వరకు దర్శనం ఇచ్చాయి.
ఈ అద్భుత దృశ్యాన్ని శివ భక్తులు తమ చరవాణిలో బంధించారు. ప్రతి మహా శివరాత్రి ముందు ఈ అద్భుత దృశ్యం జరగడం విచిత్రమని,ఇటువంటి దృశ్యం అరుదైనదని,ఆలయ ప్రధాన అర్చకులు కొంకపాక శివ విష్ణువర్ధన్ శర్మ, ధనుంజయ శర్మ తెలిపారు. ఆదిత్యుని కిరణాలు పరమశివుని స్పృశించటంతో అత్యంత ముగ్ధుడౌతాడని,తూర్పు పడమర సూర్య కిరణాలు నేరుగా శివలింగంపై పడడం ఒక్క మహా శివరాత్రి రోజు మాత్రమే చూడగలరని,అటువంటిది ముందుగానే శనివారం జరిగిన ఈ ఘటన చాలా శుభప్రదమైనదని ఆలయ అర్చకులు,భక్తులు భావిస్తున్నారు.
సత్యంన్యూస్, హుజూర్ నగర్