30.7 C
Hyderabad
April 19, 2024 09: 33 AM
Slider ఆధ్యాత్మికం

సుంద‌ర‌కాండ అఖండ పారాయ‌ణంతో పులకించిన స‌ప్త‌గిరులు

#Radhasaptami At Tirumala

విశ్వంలోని స‌క‌‌ల జీవ‌రాశులు ఆయురారోగ్యా‌ల‌తో ఉండాల‌ని శ్రీ‌వారిని ప్రార్థిస్తూ తిరుమ‌ల‌ నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఆదివారం ఉద‌యం సుందరకాండలోని 39వ సర్గ నుంచి 44వ సర్గ వరకు ఉన్న 189 శ్లోకాలను అఖండంగా పారాయణం చేశారు. ఈ పారాయణంతో తిరుమలగిరులు పులకించాయి. ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా భక్తులు తమ ఇళ్ల నుంచే పారాయణంలో పాల్గొన్నారు. ఉద‌యం 7 నుండి 9 గంటల వరకు పారాయణం జరిగింది.

కోవిడ్ – 19 వ్యాధిని అరికట్టాలని, లోక క‌ల్యాణార్థం టిటిడి నిర్వ‌హిస్తున్న‌ పారాయణ యజ్ఞంలో భాగంగా, మంత్ర పారాయణం ప్రారంభించి 318 రోజులు పూర్తి చేయగా, ఫిబ్రవరి 21వ తేదీకి సుందరకాండ పారాయ‌ణం 256 రోజులు పూర్తి అయింది. వాల్మీకి మ‌హ‌ర్షి ర‌చించిన రామాయ‌ణంలోని సుంద‌ర‌కాండ పారాయ‌ణం వ‌ల‌న బుద్ధి, బ‌లం, ధైర్యం కలిగి స‌కల జీవులు ఆయురారోగ్యాల‌తో ఉంటాయని పండితులు తెలిపారు.

సుంద‌ర‌కాండ‌లోని 68 స‌ర్గ‌ల‌లోని  2,821  శ్లోకాల‌ను మొత్తం 16 ప‌ర్యాయాలు అఖండ పారాయ‌ణం నిర్వ‌హిస్తారు.  టిటిడి ఇప్పటివరకు 9 ప‌ర్యాయాలు సుందరకాండ అఖండ పారాయ‌ణం పూర్తి చేసింది.

పదో విడ‌త‌ అఖండ పారాయ‌ణంలోని 189 శ్లోకాలను శ్రీ శేషాచార్యులు, శ్రీ ప‌వ‌న్‌కుమార్ శ‌ర్మ‌, శ్రీ మారుతి పారాయ‌ణం చేశారు. టిటిడి ఆస్థాన విద్వాంసులు గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, బుల్లెమ్మ బృందం ” వీడివో అల విజయ రాఘవుడు…, సంకీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించి “పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు… సంకీర్తనతో ముగించారు.

 ఈ పారాయ‌ణంలో ధ‌ర్మ‌గిరి వేద పాఠ‌శాల, ఎస్వీ వేద విశ్వ‌విద్యాల‌యం అధ్యాప‌కులు, ఎస్వీ ఉన్న‌త వేదాధ్యయ‌న సంస్థకు చెందిన వేదపారాయ‌ణ దారులు, రాష్ట్రీయ‌ సంస్కృత విశ్వ‌విద్యాల‌యానికి చెందిన శాస్త్రీయ పండితులు కలిపి  దాదాపు 200 మంది  పాల్గొన్నా‌రు.

Related posts

ప్రభుత్వ పథకాలను కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి

Satyam NEWS

బీఆర్ఎస్ పార్టీలో చేరిన సీతక్క అనుచరులు

Satyam NEWS

అనుమానాస్పద వ్యక్తుల పట్టివేత

Satyam NEWS

Leave a Comment