కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమల నాదనీరాజనం వేదికపై డిసెంబరు 6వ తేదీ 7వ విడత సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు.
ఆదివారం ఉదయం 7 గంటల నుండి సుందరకాండలోని 25వ సర్గ నుంచి 30వ సర్గ వరకు ఉన్న 194 శ్లోకాలను పారాయణం చేస్తారు.
సుందరకాండలోని 68 సర్గలకు గాను 2821 శ్లోకాలు ఉన్నాయి. ఈ మొత్తన్ని 16 విడతలుగా టిటిడి అఖండ పారాయణం చేయ సంకల్పించింది.
ఇప్పటి వరకు ఆరు విడతల్లో అఖండ పారాయణం జరిగింది.
ఆదివారంనాడు జరుగనున్న ఈ కార్యక్రమంలో తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, తిరుపతిలోని వేద విశ్వవిద్యాలయం, సంస్కృత విశ్వవిద్యాలయం, టిటిడి వేదపారాయణదారులు పాల్గొంటారు.
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం ద్వారా శ్రీవారి భక్తులు తమ ఇళ్లలోనే ఈ పారాయణంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరడమైనది.