34.2 C
Hyderabad
April 19, 2024 20: 40 PM
Slider ఆధ్యాత్మికం

27న నాద‌నీరాజ‌నం వేదిక‌పై 9వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

#Sundrakanda Parayanam

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై జ‌న‌వ‌రి 27వ తేదీన 9వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయణం నిర్వహించనున్నారు.

బుధ‌వారం ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 36వ సర్గ నుంచి 38వ సర్గ వరకు ఉన్న 186 శ్లోకాలను పారాయణం చేస్తారు.

తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు.

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

Related posts

మేడే: కార్మికులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

రిటైర్ అయిన పోలీసుకు ఆత్మీయ వీడ్కోలు

Satyam NEWS

విద్యల నగరంలో నిరుద్యోగులకు కుచ్చుటోపీ…

Satyam NEWS

Leave a Comment