40.2 C
Hyderabad
April 24, 2024 18: 39 PM
Slider ఆధ్యాత్మికం

ఈ నెల 10న 12వ విడ‌త‌ సుందరకాండ అఖండ పారాయ‌ణం

#LordBalaji

కరోనా వైరస్ నుంచి ప్రపంచానికి విముక్తి కల్పించాలని శ్రీవారిని ప్రార్థిస్తూ తిరుమ‌లలోని నాద‌నీరాజ‌నం వేదిక‌పై ఏప్రిల్ 10వ తేదీ శనివారం 12వవిడ‌త‌ సుందరకాండ   అఖండ పారాయణం జ‌రుగ‌నుంది.

ఇందులో భాగంగా ఉద‌యం 7 గంటల నుండి సుందరకాండలోని 49వ సర్గ నుంచి 53వ సర్గ వరకు ఉన్న 155 శ్లోకాలను పారాయణం చేస్తారు.

తిరుమల ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం, తిరుప‌తిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయం, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, వేదపారాయణదారులతో పాటు సుమారు 200 మంది ఈ అఖండ పారాయ‌ణంలో పాల్గొంటారు. కాగా ఇప్పటివరకు టిటిడి 11 విడ‌త‌ల్లో అఖండ పారాయణాన్ని విజయవంతంగా నిర్వహించింది.

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ కార్య‌క్ర‌మాన్ని  ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేయ‌నుంది. ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా శ్రీ‌వారి భ‌క్తులు త‌మ ఇళ్ల‌లోనే ఈ పారాయ‌ణంలో పాల్గొని స్వామివారి కృప‌కు పాత్రులు కావాల‌ని కోర‌డ‌మైన‌ది.

Related posts

ధరలు నియంత్రణ చేయలేని సీఎం వెంటనే గద్దె దిగిపోవాలి

Satyam NEWS

విశాఖ ఉక్కు ప‌రిర‌క్ష‌ణ కోసం…సీపీఎం పాద‌యాత్ర‌…..

Satyam NEWS

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ తుది కీ వెల్లడి

Bhavani

Leave a Comment