ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి బాబాయి, కడప జిల్లా పులివెందుల మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్ యాదవ్ రిమాండ్ ను పొడిగించారు. కడప సెంట్రల్ జైలు నుంచి సునీల్ యాదవ్ ను ఆన్లైన్ ద్వారా సిబిఐ అధికారులు కోర్టుకు హాజరు పరిచారు.
విచారించిన జమ్మలమడుగు మెజిస్ట్రేట్ రిమాండ్ ను ఈ నెల 15 వరకు పొడిగించారు. సునీల్ యాదవ్ కు నార్కో అనాలసిస్ టెస్ట్ అనుమతి పై జమ్మలమడుగు కోర్టులో ఆన్లైన్ ద్వారా ఇరువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు. జమ్మలమడుగు మెజిస్ట్రేట్ నార్కో అనాలసిస్ పిటిషన్ ను డిస్మిస్ చేశారు.