39.2 C
Hyderabad
April 25, 2024 18: 38 PM
Slider సినిమా

కరోనాపై యుద్ధానికి మహేష్ బాబు కోటి విరాళం

mahesh babu

కరోనా మహమ్మారిని తరిమి కొట్టేందుకు తన వంతు సాయంగా సూపర్ స్టార్ మహేష్ బాబు కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ మొత్తం అందిస్తున్నట్లు మహేష్ బాబు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో అందరం కలిసి కట్టుగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు.

సమస్యపై పోరాడేందుకు ప్రతి ఒక్కరూ అవసరమైన సాయం చేయాలని మహేష్ బాబు పిలుపునిచ్చారు. దేశ వ్యాప్తంగా అమలు జరుగుతున్న లాక్ డౌన్ కు అందరూ మద్దతు పలకాలని మహేష్ బాబు కోరారు. లాక్ డౌన్ నిబంధనలను అందరూ పాటించాలని మానవత్వంతో వ్యవహరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ యుద్ధంలో మనం గెలవాలని ఆయన అన్నారు.

Related posts

ములుగు జిల్లా కేంద్రంలో బస్సు డిపో ఏర్పాటు చేయాలి

Satyam NEWS

కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి అన్యాయం జరిగినా ప్రశ్నించలేని స్థితిలో జగన్ రెడ్డి

Satyam NEWS

అనాథలుండని తెలంగాణను కలగన్న ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS

Leave a Comment