ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు భారత ప్రభుత్వం మరియు సైన్యం చేస్తున్న చర్యలకు సంఘీభావంగా బాలానగర్ డివిజన్లో కార్పొరేటర్ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా జాతీయ జెండాలను చేత పట్టి సంఘీభావ ర్యాలీని నిర్వహించారు నాయకులు డివిజన్ ప్రజలు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పహల్గాం ఘటనలో 26 మంది భారతీయులను చంపిన ఉగ్రవాదుల పైన భారత సైన్యం చేపడుతున్న చర్యలను విజయవంతం కావాలని వారు ఆకాంక్షించారు. అదేవిధంగా దేశ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరు ఒకతాటిపైన నిలబడి భారత సైన్యానికి అండదండలు అందించాలని కార్పొరేటర్ రవీందర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.
previous post
next post