35.2 C
Hyderabad
April 24, 2024 14: 38 PM
Slider విజయనగరం

ఒకే రోజు రెండు పోలీసు స్టేషన్ లు తనిఖీ

#police

పెదమానాపురం ,బూర్జువరస పీఎస్ లను సందర్శించిన విజయనగరం పోలీసు బాస్

వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ దీపికా ఒకే రోజు రెండు పోలీసు స్టేషన్ లను సందర్శించారు. తొలుత పెద మానాపురం పీఎస్ ను సందర్శించి, రికార్డులు, సిడి ఫైల్స్ ను తనిఖీ, కేసు ప్రాపర్టీని, లాకప్ గదులను పరిశీలించారు. పోలీసు సిబ్బంది, అధికారులు, మహిళా సంరక్షణ పోలీసులు విధిగా గ్రామ సందర్శన చేయాలని, ఆసాంఘిక కార్యకలాపాల సమాచారం సేకరించాలని, రైడ్స్ నిర్వహించి, కేసులు నమోదు చేయాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

అక్కడ నుంచీ మానాపురం పీఎస్ ను తనిఖీ చేసిన అనంతరం  బూర్జువలస పీఎస్ ను సందర్శించారు. రికార్డులు, సిడి ఫైల్స్ ను తనిఖీ, కేసు ప్రాపర్టీని, లాకప్ గదులను పరిశీలించారు. పోలీసు సిబ్బంది, అధికారులు, మహిళా సంరక్షణ పోలీసులు విధిగా గ్రామ సందర్శన చేయాలని, శాంతిభద్రతలకు ఎటువంటి విఘాతం లేకుండా చూడాలని, ఆసాంఘిక కార్యకలాపాల సమాచారం సేకరించి, రైడ్స్ నిర్వహించాలని అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.ఈ వార్షిక తనిఖీల్లో జిల్లా ఎస్పీ వెంట బొబ్బిలి డిఎస్పీ బి.మోహనరావు, గజపతినగరం సిఐ ఎల్.అప్పల నాయుడు, ఎస్ఐలు రాజేష్  భాగ్యం మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

గండి రామన్న దత్త సాయి మందిరం లో ధుని ప్రారంభించిన మంత్రి

Satyam NEWS

స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ, మనో ధైర్యంగా ఉండాలి

Satyam NEWS

ఏపీ పోలీసుల అదుపు లో 29 కేసుల నిందితుడు…!

Satyam NEWS

Leave a Comment