వార్షిక తనిఖీల్లో భాగంగా విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక…. రేగిడి ఆమదాలవలస పోలీసు స్టేషన్ ను సందర్శించారు. స్టేషను రికార్డులు, సీడీ ఫైల్స్ తనిఖీ చేసి, అధికారులకు పలు సూచనలు చేశారు. అనంతరం, ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎంఎల్సీ ఎన్నికలు నిర్వహించే పోలింగు కేంద్రాలను సందర్శించి, భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. అనంతరం, ఎంఎస్పీలతో మమేకమై, ప్రజలకు సైబరు నేరాలు, దిశా ఎస్ఓఎస్ మొబైల్ యాప్ పట్ల అవగాహన కల్పించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే సమస్యలను గుర్తించి, సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు. ఈ ఆకస్మిక తనిఖీ లో రాజాం రూరల్ సీఐ హెచ్.ఉపేంద్ర, ఎస్ఐ ఈ.శ్రీనివాసరావు, సంతకవిటి ఎస్ఐ జనార్ధనరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది ఉన్నారు.
previous post
next post