స్వాతంత్య్ర దినోత్సవం రోజు క్షేత్ర స్థాయిలో ప్రజాప్రతినిధులు, రిపబ్లిక్ దినోత్సవం రోజు అధికారులు జాతీయ పతాకాన్ని ఎగురవేయడం ఆనవాయితీ.
జాతీయ స్థాయిలో ప్రధాని, రాష్ట్ర స్థాయిలో ముఖ్యమంత్రులు, జిల్లా స్థాయిలో ప్రభుత్వం ప్రత్యేకంగా నియమించిన మంత్రులు, గ్రామాలలో సర్పంచ్ లు జెండా ఎగురవేయడం సాంప్రదాయం.
అయితే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ లాంఛనానికి తిలోదకాలు ఇచ్చింది. స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలలో సర్పంచ్లకు రాష్ట్ర ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది.
స్వాతంత్ర్య దినోత్సవం రోజు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కమిటి ఛైర్మన్లతో జెండా ఎగురవేయించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయంతో సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే సర్పంచ్ లు ఏం చేయగలరు? ఏం చేయలేరు…