ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని గుర్తిస్తూ కొత్తగా తయారు చేసిన మ్యాప్ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ట్విట్టర్ లో విడుదల చేశారు. ఏపీ రాజధానిని పేర్కొనకుండా మ్యాప్ విడుదల చేయడం రాష్ట్ర ప్రజాలను ఆశ్చర్యానికి గురి చేసిందని నిన్న లోకసభ జీరో అవర్లో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ప్రస్తావించారు. జయదేవ్ లేవనెత్తిన అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కేంద్ర హోం శాఖ సంబంధింత శాఖల అధికారులతో చర్చించిన తర్వాత సర్వే ఆఫ్ ఇండియా కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. జరిగిన తప్పును సరిదిద్ది కొత్త మ్యాప్ ను హోం శాఖకు పంపారు. దీన్నికొద్దిసేపటి క్రితం కిషన్ రెడ్డి ట్విట్టర్ లో పెట్టారు.