39.2 C
Hyderabad
April 23, 2024 17: 17 PM
Slider పశ్చిమగోదావరి

పశ్చిమగోదావరి జిల్లాలో వసతి గృహంలో బాలిక అనుమానాస్పద మృతి?

#penumantra

పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలంలోని మార్టేరు వసతి గృహంలో దారుణం చోటు చేసుకుంది. వివరాలోకి వెళితే కోడేరు రోడ్డులోని బాలికల వసతి గృహంలో ఎనిమిదో తరగతి చదువు తున్న గెడ్డం స్రవంతి(13 సంవత్సరాలు) పొదలాడ గ్రామం ఇరగవరం మండలం చెందిన బాలిక రూమ్ లో ఉరి వేసుకుందనే సమాచారంతో యస్ఐ రమేష్ సంఘటన స్థలానికి చేరుకున్నారు.

ప్రభుత్వ బాలికల వసతి గృహంలో బాలిక అనుమానాస్పద మృతి చెందిందని వార్తల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా, జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ వారి ఆదేశాల మేరకు మండల తహసీల్దార్ దుర్గకిషోర్, పెనుగొండ సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

ఎనిమిదో తరగతి చదువుతున్న తమ కుమార్తె స్రవంతి ఆత్మహత్య చేసుకుందని సమాచారంతో వార్తతో తల్లిదండ్రులు శోక సముద్రంలో మునిగిపోయారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం.

Related posts

Safety Tips: ఎక్కడికీ వెళ్లవద్దు ఇంట్లోనే ఉండండి

Satyam NEWS

గణేష్ శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు

Bhavani

పిఆర్సి నివేదికలను దహనం చేసిన TUTF ఉపాధ్యాయులు

Satyam NEWS

Leave a Comment