బాపట్ల జిల్లా బాపట్ల మండలం నందిరాజతోటలో వివాహిత కృష్ణవేణి మృతిపై పలు ఆరోపణలు వినబడుతున్నాయి. ఆమెది హత్యా ఆత్మహత్య అనేది పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేసి వివరాలు తెలపవలసి ఉంది.
మృతురాలు తల్లి అయితే తన కూతుర్ని భర్త జొన్న గోపి,మరిది శివ బాబు,అత్త రవణమ్మ,మామ బిక్షాలు కలిసి ఉరితీసి చంపేశారని ఆరోపణలు చేస్తుంది. ఆ సమయంలో తాను కూడా అక్కడే ఉన్నానని అడ్డుకోబోయిన తనను కిందపడేసి తన్ని కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయానని చెబుతుంది. పోలీసులకు చెబితే చంపేస్తానని బెదిరించారని తన కూతురి మరణంలో పూర్తిస్థాయిలో పోలీసులు విచారణ చేసి తనకు న్యాయం జరగాలని కన్నీటి పర్వతం అవుతుంది.
కర్లపాలెం మండలం యాజిలి గ్రామానికి చెందిన కృష్ణవేణిని బాపట్ల మండలం నందిరాతోట చెందిన గోపికి మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. గత కొన్ని నెలలుగా మృతురాలు మరోక వ్యక్తితో పరిచయం పెంచుకొని చరవాణి ద్వారా మాట్లాడుతుందనే అనుమానంతో భర్త గోపి,మరిది శివ బాబు, అత్తమామలు కలిసి చంపారని మృతురాలు తల్లి ఆరోపిస్తుంది.