అయ్యప్పస్వామి జన్మ నక్షత్రమైన ఉత్తర నక్షత్రం సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట అయ్యప్పస్వామి దేవాలయంలో మధు గుండయ్యశర్మ అధ్వర్యంలో గౌతంరమాకాంత్, వఝల శ్రీకాంత్ శర్మ లు ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. పంచామృతాలతో, పురుషసూక్త, శ్రీసూక్త సహిత రుద్రాభిషేక ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు.
కమిటీ సభ్యులు బొమ్మకంటి భాస్కర్, అల్లాడి మురళి పెద్ద మల్లేశం, కేశవులు సభ్యులు,గురు స్వాములు చకిలం మధు గురుస్వామి, కందుకూరి రవిగురుస్వామి, అచ్చరవి, బాపురెడ్డి, చింతరాజు, రాజుస్వామి ,బాలకృష్ణ , రంజిత్, శివ, అయ్యప్పస్వామి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తదనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.