32.2 C
Hyderabad
June 4, 2023 19: 09 PM
Slider ఆధ్యాత్మికం

సరస్వతీశక్తి పీఠం పునరుద్దరణకు దోహదం

SWAMY

జమ్ము కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడాన్ని విశాఖపట్నం శారదాపీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి స్వాగతించారు. ఆర్టికల్ 370  రద్దు చారిత్రాత్మక నిర్ణయం అని ఆయన అన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలు అభినందనీయులు అంటూ ఆయన ప్రశంసించారు. జమ్ముకశ్మీర్ లో ప్రజల సమగ్ర వికాసం సాకారమవుతుందని అభిప్రాయపడ్డారు. దీనితో కశ్మీర్ లోని సరస్వతీ శక్తిపీఠం పునరుద్ధరణకు దోహదపడుతుందని వ్యాఖ్యానించారు. దేశంలోని శక్తి పీఠాలన్నింటిని దర్శించే అవకాశం దక్కుతుందని స్వరూపానందేంద్ర సరస్వతి అభిప్రాయపడ్డారు. 

Related posts

STUTS ఉపాధ్యాయ సంఘ క్యాలెండర్ ఆవిష్కరణ

Satyam NEWS

చింతమడకలో ఇంటికి 10 లక్షలు- మరి మాకో?

Satyam NEWS

జ్ఞాన దీప్తి మనలను వదిలేసి అమరలోకానికి వెళ్లిపోయింది

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!