స్వామి వివేకానంద 158 వ జయంతి వేడుకలను ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వేదికగా ఎనుగంటి రాజు నేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.
వ్యక్తులు బలంగా దృఢంగా తయారైన అప్పుడే సమాజం దృఢంగా తయారవుతుందని భారతదేశం సంస్కృతి, సాంప్రదాయాలను, హిందుత్వాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన స్వామి వివేకానంద జీవిత చరిత్రను నేటి తరం యువకులు తెలుసుకోవడం ఎంతో ముఖ్యం అని నాయకులు పేర్కొన్నారు.
మన బలమే మనల్ని జయం వైపు నడిపిస్తుందని… బలమైన యువత ఈ దేశానికి రాబోయే రోజుల్లో ముఖ్యమని అన్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హైదరాబాద్ జిల్లా బిజెపి యువమోర్చా ప్రధాన కార్యదర్శి శివాజీ, నాయకులు శక్తి సింగ్, సాయి యాదవ్, ఓయూ జేఏసీ నాయకులు మహేష్ నేత, రాము హిందూ సేన, శ్రీనివాస్, సురేష్, కిరణ్, సుదీర్, రవి, శ్రీనివాస్ దయ్యాల, రాజ్ కుమార్ నాయక్ , రాజేష్ తదితరులు హాజరయ్యారు.