కల్వకుర్తి పట్టణంలో స్వామి వివేకానంద సేవా బృందం ఆధ్వర్యంలో స్వామి వివేకానంద 158వ జయంతి వేడుకలు స్థానిక మైసమ్మ దేవాలయం ఎదుట కల్వకుర్తి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బృందం సభ్యులు విధులలో నినాదాలతో వివేకానందను స్మరించారు.
అనంతరం దేవాలయం ఎదుట వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం సేవ బృందం సభ్యులు మాట్లాడుతూ వివేకానందుడు చేసిన సేవలు చాలా గొప్పవి అని ప్రతి ఒక్కరు ఆయన మాటలను ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాల్లో పాల్గొని సమాజాన్ని ముందుకు నడిపించాలి అని కోరారు.
కార్యక్రమంలో సేవా ప్రతినిధులు ఉత్తేజ్,అజయ్,వరుణ్,,తదితరులు పాల్గొన్నారు.