41 రోజుల పాటు నియమ నిష్టల తో అయ్యప్పస్వామిని పూజించిన స్వాముల శరణు ఘోష తో ములుగు జిల్లా కేంద్రంలో ని రామాలయం మారుమోగింది. గత కొంత కాలంగా అయ్యప్పస్వామీ మాల ధరించిన స్థానిక భక్తులు నియమ నిష్టాలతో స్వామివారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న మండపాలల్లో శక్తిమేర పూజించి 41వ రోజు పూర్తి అవుతున్న సందర్బంగా ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని 40 మందికి పైగా స్వాములు పూజాది కార్యక్రమాలను నిర్వహించగా గురుస్వామి సురేందర్ స్వామి, రమేష్ పాపారావు స్వాములు చిన్న స్వాములు ఇరుముడి కట్టి కేరళలోని సన్నిధానం కు పయనమయ్యారు. ఈ కార్యక్రమం జరుగుతున్నంత సేపు మాలధరించిన స్వాములతో పాటుగా వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు, ఒక్కసారిగా ములుగు పట్టణం లోని రామాలయనికి చేరుకోవడం, స్వామివారి శరణుఘోష పాటల నడుమ పండగ వాతావరణం కొనసాగింది. బయలుదేరిన స్వాములంతా జనవరి 15 మకర సంక్రాంతి జ్యోతి దర్శనానికి శబరిమల చేరుకొని మాల విరమణ చేస్తామని చదువు శశి స్వామి చెప్పారు.
previous post