32.2 C
Hyderabad
March 29, 2024 21: 28 PM
Slider హైదరాబాద్

నాణ్యమైన రుచికరమైన స్వీట్లు అందించి ప్రజల మన్ననలు పొందాలి

#balajeesweets

నాణ్యమైన మన్నికైన రుచికరమైన స్వీట్ లు అందించి ప్రజల మన్ననలు పొందాలని ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఉప్పల్ సర్కిల్ ఎల్ చిలక నగర్ డివిజన్ లోని గణేష్ నగర్ మెయిన్ రోడ్డు లో శ్రీ బాలాజీ బాలకిషన్ మిఠాయి భండార్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి , స్థానిక కార్పొరేటర్  బన్నల గీత ప్రవీణ్   ముదిరాజ్ తో కలిసి ప్రారంభించారు.

ఈ  సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నాణ్యమైన మన్నికైన రుచికరమైన స్వీట్లు అందించి వారి యొక్క మన్ననలు పొందాలని సూచించారు.   నిర్వాహకులు  బాలాజీ బాలకిషన్ మాట్లాడుతూ మావద్ద అన్ని రకాల స్వీట్లు, మిఠాయిలు, స్వచ్ఛమైన నెయ్యితో తయారుచేయ బడతాయని, అందరికీ అందుబాటు ధరలో ఉంటాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు జనంపల్లి వెంకటేశ్వర్ రెడ్డి, బద్దం భాస్కర్ రెడ్డి, మేకల మధుసూదన్ రెడ్డి, గరిక సుధాకర్, బన్నల  ప్రవీణ్  ముదిరాజ్, వేముల సంతోష్ రెడ్డి, ఎం.డి ముస్తాక్, చిల్కానగర్ డివిజన్ ప్రెసిడెంట్ పల్లె నర్సింగ్ రావు, పిట్టల నరేష్ ముదిరాజ్, గుడి మధుసూదన్ రెడ్డి, పండ్ల క్రిషన్రామానుజం, బింగి శీను, రవీందర్, వేముల పరమేష్, చిలుక నగర్ డివిజన్ మహిళా అధ్యక్షురాలు సుభద్ర, టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆగని పాకిస్థాన్ దుశ్చర్యలు: ఈ సారి డ్రోన్ ప్రయోగం

Satyam NEWS

ఎమ్మెల్సీ రమణ కుటుంబాన్ని పరామర్శించిన కవిత

Bhavani

సిద్దాపూర్ రిజర్వాయర్ పనులు త్వరగా పూర్తి కావాలి

Satyam NEWS

Leave a Comment