కడప జిల్లా నందలూరు లోని ప్రసిద్ద శ్రీ సౌమ్యనాధ స్వామి బ్రహ్మోత్సవాలల్లో ఎనిమిది రోజు ఉదయం శ్రీ సౌమ్యనాధ స్వామి శ్రీదేవి భూదేవి కళ్యాణము అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఆలయ ప్రాంగణంలో అందంగా అలంకరించిన కల్యాణ మండపంలో వధు వరులు శ్రీ సౌమ్యనాధ స్వామి శ్రీదేవి భూదేవిలను పట్టువస్త్రాలతో, స్వర్ణాభరణాలతో, వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు.
రాజంపేట ఎమ్మెల్యే మేడా వెంకట మల్లికార్జున రెడ్డి కుటుంబసభ్యులు కల్యాణంకు పట్టు వస్త్రాలు,ముత్యాల తలంబ్రాలు సమర్పించారు.
మంగళ వాయిద్యాలు, వేద మంత్రాలు, భక్తుల గోవింద నామాల ఘోష మధ్య స్వామి వారు దేవేరుల మెడలో మాంగళ్య ధారణ గావించగా కల్యాణం కడు రమణీయంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో బ్రహ్మోత్సవాల కమిటీ అధ్యక్షుడు మేడా విజయ భాస్కర్ రెడ్డి, కల్యాణోత్సవ కమిటీ కార్య నిర్వహక కార్యదర్శి మేడా విజయ శేఖర్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే అకేపాటి అమరనాధరెడ్డి,మేడా మధు సూధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సొట్టు సాంబశివమూర్తి,పసుపు లేటి శంకర్, గానుగపెంట హనుమంత రావు,ఆర్ముగం విశ్వనాధ్లు తమ చక్కట్టి గాత్రలతో కళ్యాణ వ్యాఖ్యాతలుగా భక్తులను ఆకట్టుకున్నారు.
వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన గా వారికి నిర్వాహకులు అన్న, తీర్థ ప్రసాదాలు,ముత్యాల తలంబ్రాలు పంపిణీ చేశారు.పోలీసులు,స్వచ్చంద సేవకులు, వైద్య సిబ్బంది భక్తులకు సేవలందించారు.