28.7 C
Hyderabad
April 20, 2024 06: 39 AM
Slider హైదరాబాద్

టిఆర్ఎస్ కు బ్రాహ్మణుల మద్దతు

Branamins

బ్రాహ్మణులతో పాటు అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి బాటలు వేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా ఉందామని తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ ప‌రిష‌త్ స‌భ్యుడు జోషి గోపాల శ‌ర్మ గ్రేటర్ వాసులకు విజ్ఞప్తి చేశారు.

బుధవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిషత్ డైరెక్టర్ జోషి గోపాల శాస్త్రి మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలో బ్రాహ్మణుల పరిస్థితి అత్యంత దారుణంగా ఉండేదని రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయాల వల్ల అనేక దేవాలయాల్లో దూప దీప నైవేద్యాలు పెరగడంతో బ్రాహ్మణులకు ఎంతో ఊరట లభించిందని అన్నారు.

పేద బ్రాహ్మణుల అభ్యున్నతికి బ్రాహ్మణ పరిషత్ తోడ్పాటు అందిస్తుందని అన్నారు. అదేవిధంగా యాదాద్రి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించి హిందూ దేవాలయాల పట్ల తనకున్న అభిరుచిని కేసిఆర్ చాటుకున్నారని అన్నారు. ఎన్నివిద్యలు ఉన్నప్పటికి ఎంతో మంది వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారని అలాంటివారికి చేయూతనిచ్చేందుకు ఎన్నో సంక్షేమ పథకాలను రూపొందించారని అన్నారు.

ఇవ‌న్నీ దృష్టిలో పెట్టుకొని గ్రేటర్ వాసులు టిఆర్ఎస్ అభ్యర్థులకు పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాఘవేంద్ర శర్మ, కులకర్ణి, శాంతా నంద, పురోహిత్ రాకేష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రవాణా శాఖ పై మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమీక్ష

Bhavani

నడక మళ్ళీ ఇంటి వైపుకే..

Satyam NEWS

అన్నప్రసాదం ట్రస్టుకు రూ. 1 కోటి 10 లక్షలు విరాళం

Satyam NEWS

Leave a Comment