ఈ ఏడాది అక్టోబర్ లో జరిగే T20 ప్రపంచ కప్ మ్యాచ్ లలో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో భారత్ ఢీ కొనాల్సి ఉంటుంది. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మ్యాచ్ల షెడ్యూల్ ను విడుదల చేసింది. గతేడాది దుబాయ్లో జరిగిన టీ20 ప్రపంచకప్లో ఇరు జట్లు తలపడినప్పుడు భారత్ తొలిసారిగా పాకిస్థాన్ చేతిలో ఓడిపోయింది. ఈ టోర్నమెంట్ కు ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇస్తున్నది. అక్టోబర్ 16న ప్రారంభం అయ్యే ఈ మ్యాచ్ లు నవంబర్ 13 వరకూ కొనసాగుతాయి. గ్రూప్ వన్ లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్థాన్ లు ఉంటాయి. గ్రూప్ 2 లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ తలపడతాయి. వీటితో బాటు మొత్తం రెండు గ్రూపుల్లో 16 దేశాల జట్లు తలపడుతున్నాయి. అడిలైడ్, బ్రిస్బెన్, జియోలాంగ్, హోబర్ట్, మెల్బోర్న, పెర్త్, సిడ్నీలలో మ్యాచ్ లు జరుగుతాయి. అక్టోబర్ 16న లంక జట్టు నమీబియాతో తలపడటంతో మ్యాచ్ లు ఆరంభం అవుతాయి. నవంబర్ 9 మరియు 10 తేదీల్లో సెమీ-ఫైనల్లు వరుసగా SCG మరియు అడిలైడ్ ఓవల్లో జరుగుతాయి. అడిలైడ్ ఓవల్ ప్రపంచకప్ సెమీఫైనల్కు ఆతిథ్యమివ్వడం ఇదే తొలిసారి. నవంబర్ 13న మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో లైట్ల వెలుగులో ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
previous post
next post