సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామం లో ఉన్న అలుగును సందర్శించారు తాహసిల్దార్ జయశ్రీ. గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొర్లిపోతున్నాయి.
తహసిల్దార్ జయశ్రీ మండలంలోని పలు గ్రామాల్లో నీట మునిగి పోయిన పంట పొలాలను, వాగులు వంకలను పరిశీలించారు.
లింగగిరి చెరువు నుండి అలుగు పొంగటంతో రాక పోకలకు ఇబ్బంది ఏర్పడడంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తగు సూచనలు చేశారు. వర్షాలకు ఇండ్లు మునిగిపోయినా,ఇండ్లు కూలినా, పంట పొలాలకు నష్టం వాటిల్లినా వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.