25.7 C
Hyderabad
May 24, 2025 09: 00 AM
Slider నల్గొండ

జోరువాన లో బ్రిడ్జిని పరిశీలించిన తాహసిల్దార్ జయశ్రీ

#HujurngarRDO

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లింగగిరి గ్రామం లో ఉన్న అలుగును సందర్శించారు తాహసిల్దార్ జయశ్రీ. గత వారం రోజుల నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొర్లిపోతున్నాయి.

తహసిల్దార్ జయశ్రీ మండలంలోని పలు గ్రామాల్లో నీట మునిగి పోయిన పంట పొలాలను, వాగులు వంకలను పరిశీలించారు.

లింగగిరి చెరువు నుండి అలుగు పొంగటంతో రాక పోకలకు ఇబ్బంది ఏర్పడడంతో ప్రజలను అప్రమత్తంగా ఉండాలని తగు సూచనలు చేశారు. వర్షాలకు ఇండ్లు మునిగిపోయినా,ఇండ్లు కూలినా, పంట పొలాలకు నష్టం వాటిల్లినా వెంటనే సమాచారం ఇవ్వాలని కోరారు.

Related posts

నటుడు కమల్ హాసన్ కు తీవ్ర అస్వస్థత

Murali Krishna

పోలీసులు నైతిక విలువలతో మెలగాలి

Satyam NEWS

బీసీ స్టడీ సర్కిళ్ల కోచింగ్ ఎంట్రన్స్ కోసం ఆన్లైన్ నమోదు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!