హైదరాబాద్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని వివేకానంద నగర్ కాలనీ లో TAIKA మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆరేకపూడి గాంధీ నేడు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ నవీన్ రావు, కూకట్ పల్లి ఏసీపీ సురేందర్ రావు, కూకట్ పల్లి CI లక్ష్మీనారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆరేకపూడి గాంధీ మాట్లాడుతూ ఈ ప్రాంతంలో పిల్లలకు కరాటే, బాక్సింగ్, మార్షల్ ఆర్ట్స్ వంటి క్రీడలలో అత్యున్నత ప్రమాణాలతో, అంతర్జాతీయ స్ధాయిలో పాల్గొనే విధంగా ఇక్కడ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు.
రాబోయే సంవత్సరాలలో ఇక్కడ శిక్షణ తీసుకునే పిల్లలు అంతర్జాతీయ వేదిక మీద పాల్గొని పథకాలు సాధించి పేరు ప్రఖ్యాతలు సాధించి కుటంబ సభ్యులకు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు.
విద్యార్థులకు చదువు తో పాటు క్రీడలు అవసరమని ఆయన అన్నారు.
క్రీడల వల్ల శారీరక, మానసిక ఉల్లాసం లభిస్తుందని, నిరంతర సాధనతో, కృషి, క్రమశిక్షణ, సడలని పట్టుదల ఉంటే సాధించలేనిది ఏమి లేదని ఆయన అన్నారు.
లక్ష్యం సాధించడం కోసం నిరంతరం కృషి చేయాలనీ, అదేవిధంగా చిన్నారులలో దాగిన నైపుణ్యాన్ని గుర్తించి ప్రోత్సహించడం ద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు.
ఈ సందర్భంగా TAIKA మార్షల్ ఆర్ట్స్ అకాడమీ యజమాని అశోక చక్రవర్తి ని ప్రత్యేకంగా గాంధీ అభినందించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పోరేటర్ రంగా రావు,
తెరాస నాయకులు నాయినేని చంద్రకాంత్ రావు, ఆదిత్య, కాలనీ అధ్యక్షుడు భీమ్ రావు, దేవినేని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.