కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం లో బీర్కూర్ మంజీరా నది నుండి గత వారం రోజుల క్రితం వే బిల్లులు లేకుండా తరలిస్తున్న రెండు ఇసుక లారీలను పోలీసులు సీజ్ చేశారు.
దీంతో వాటికి ఐదో తేదీనాడు వేలం వేయాల్సి ఉండగా నాలుగో తేదీ నాడు బిచ్కుంద ఎస్సై సాయన్న రెండు ఇసుక ట్రాక్టర్లను లారీలోనుండి నింపి ఆలయాలకు తరలించాడు.
ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడం, అన్ని ప్రధాన పత్రికల్లో రావడంతో రెవెన్యూ అధికారులు వేలం పాటను వాయిదా వేశారు.
ఈ విషయం పై వైఎస్ షర్మిల పార్టీ నాయకులు బోరిగి సంజు బిచ్కుంద ఎస్సైపై చర్యలు తీసుకోవాలంటూ తహసీల్దార్ పి.ఆనంద్ కుమార్ కు వినతిపత్రం సమర్పించారు.
ఈ కార్యక్రమంలో షర్మిల పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు.