ప్రభుత్వం కల్పించే సంక్షేమ పథకాలు అందిపుచ్చుకుని లబ్ది దారులు అభివృద్ధిని చేరుకోవాలని ఏలూరు జిల్లా పెదవేగి ఎం పి పి తా తా రమ్య అన్నారు. పెదవేగి మండల కేంద్రం లో జగనన్న లేఅవుట్ లో గృహ లబ్ధిదారులు గృహాలు నిర్మించుకోవడానికి వీలుగా నీటి సదుపాయం కోసం 10 లక్షల రూపాయల మండల పరిషత్ నిధులు వెచ్చించి బోరు నిర్మించామని చెప్పారు. మండల కేంద్రం లో 24 గంటల విద్యుత్ సదుపాయం కూడా ఉందని ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని గృహ లబ్ధిదారులు వారి వారి స్థలాలలో గృహానిర్మాణాల వేగవంతం చేసుకోవాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఎం పి డి ఓ జి రాజ్ మనోజ్ ఎం పి పి తా తా రమ్య తో బాటు పెదవేగి మండల హోసింగ్ ఏ ఈ నాగరాజు పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ పలువురు ఇంజనీరింగ్ అసిస్టెంటల తో కలిసి పెదవేగి గ్రామం లో ఉన్న మూడు లేఅవుట్ లలో 12 మంది లబ్ధిదారుల గృహానిర్మాణాల కు సామూహిక శంఖుస్థాపనలు చేశారు.