సెప్టెంబర్ ఫస్ట్ నుంచి స్కూల్స్ ప్రారంభం అవుతుండడంతో అంబర్పేట్ కార్పొరేటర్ ఈ.విజయ్ కుమార్ గౌడ్ అంబర్పేట్ డివిజన్లోని పాఠశాలల ప్రిన్సిపల్స్ తో ప్రగతి స్కూల్లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రిన్సిపల్స్ తో మాట్లాడుతూ ప్రభుత్వపరంగా ప్రతి స్కూల్లో శానిటేషన్ చేయిస్తూన్నామని, పాఠశాల ఆవరణలో, లోపల బ్లీచింగ్ పౌడర్ చేయిస్తున్నామని తెలిపారు.
ప్రతి విద్యార్థుల మధ్య భౌతిక దూరం పాటిస్తూ, ప్రతి విద్యార్థి మాస్కు ధరించే విధంగా ఏర్పాట్లు ఉండాలని, విద్యార్థులకు కోవిడ్ 19 కరోనా పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఆమనూరి సతీష్, జాఫర్, తిరుపతి, ఖలీల్, రాజ్ కుమార్, రంగు ఉదయ్ గౌడ్, సంతోష్ చారి, తదితరులు పాల్గొన్నారు.