37.2 C
Hyderabad
March 29, 2024 17: 58 PM
Slider కర్నూలు

ఆంధ్రప్రదేశ్ లో రాజ్యమేలుతున్న తాలిబాన్ మూకలు

#bjpvishnuvardhanreddy

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆంధ్రప్రదేశ్ ఆఫ్ఘనిస్థాన్ గా మారిందని, వైసీపీ నేతలు తాలిబాన్లు లాగా పాలిస్తున్నారని బిజెపి రాష్ట్ర ప్రధానకార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. వైసీపీ ఓ ఉగ్రవాద పార్టీ అని ఆయన అన్నారు. వైసీపీ లో శిక్షణ పొందిన వారు తాలిబాన్లు గా తయారయ్యారని ఆయన అన్నారు.

వారంతా ఎమ్మెల్యేలు, డిప్యూటీ సీఎం ల రూపంలో రాష్ట్రాన్ని పాలిస్తున్నారని విష్ణువర్ధన్ రెడ్డి ఆరోపించారు. కర్నూలు జిల్లా ఆత్మకూరు ఘటన రెండు వర్గాల మధ్య జరిగింది కాదు.. వైసీపీ, బీజేపీ మధ్య జరిగిన సంఘటన. వైసీపీ నేతలను కేసు నుంచి తప్పించేందుకు మత ఘర్షణలుగా చిత్రీకరిస్తున్నారని ఆయన అన్నారు.

ఆత్మకూరు ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి చేస్తున్న చర్యలు ప్రజాస్వామ్యంలో సిగ్గుచేటని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఎస్డీఎఫ్ రూపంలో ఉగ్రవాదమూకలు పని చేస్తున్నాయి. సీఎం జగన్, హోం మంత్రి సుచరిత సమాధానం చెప్పాలి. శిక్షణ పొందిన కొంత మందిని అరెస్ట్ చేశామని ఎస్పీ మీడియాకు చెప్పారు.

పోలీసులు అరెస్ట్ చేసిన ఉగ్రవాద మూకలతో వైసీపీ ఎన్నికల్లో పొత్తుపెట్టుకున్నారు. సీఎం జగన్, ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి మధ్య జరిగిన చర్చలు బయటపెట్టాలి అని విష్ణువర్ధన్ రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీ కేంద్ర ఆఫీస్ సూచనలతోనే ఆత్మకూరులో దాడులు జరిగాయని, పోలీస్ స్టేషన్ పై దాడి జరిగిందని, అక్కడ వాహనాలు దగ్ధం చేశారని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.

ఆత్మకూరుకు వెళ్లకుండా టీడీపీ నేతలను అడ్డుకున్న వాళ్ళు డిప్యూటీ సీఎం అంజాద్ ఖాన్, హఫీజ్ ఖాన్ ను ఎందుకు పంపారు…? అని ఆయన ప్రశ్నించారు. నిందితులను అరెస్ట్ చేయవద్దని డిప్యూటీ సీఎం సమక్షంలో శిల్ప చక్రపాణి రెడ్డి ఎలా కోరతారు…? అంటూ ఆయన ప్రశ్న వేశారు.

ఆత్మకూరులో దాడి జరిగింది ఒక వ్యవస్థపైన….పోలీసులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని పారిపోవడంపై సీఎం, హోం మినిస్టర్ మాట్లాడారా….? అని ఆయన అన్నారు. గుంటూరు లో పోలీస్ స్టేషన్ పై దాడి చేస్తే వైసీపీ ప్రభుత్వం కేసులు ఎత్తి వేసింది. ఆత్మకూరులో కూడా కేసులు ఎత్తివేస్తామని ఎమ్మెల్యేలు చెబుతున్నారు. ఐపిసి ని వైసీపీ గా మార్చేస్తారా అంటూ ఆయన ప్రశ్నించారు. బాధితుడైన బుడ్డా శ్రీకాంత్ రెడ్డి పై హత్య కేసు ఎలా పెడతారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.

Related posts

రాజకీయ మాఫియా అడ్డాగా ఆదిలాబాద్ రిమ్స్

Satyam NEWS

పేదలకు  ఆర్థిక అండగా మంత్రి ఎస్ ఎన్ ఆర్

Satyam NEWS

ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు జరిగే అవకాశం లేదు

Satyam NEWS

Leave a Comment