ఈ నెల 16న జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి వనపర్తి జిల్లాకు వస్తున్నారని తెలంగాణ రాష్ట్ర బిసి సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచాల యుగంధర్ గౌడ్ తెలిపారు.
మధ్యాహ్నం 02 గంటలకు పెబ్బేరులో పెబ్బేరు సంత స్థలం, వనపర్తి జిల్లా కేంద్రంలో ఉన్న వందల కోట్ల విలువ చేసే ఎండోమెంట్ భూవివాదం ఇతర ఫిర్యాదులపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో హియరింగ్ ఉంటుందని తెలిపారు.
బీసీ సంఘాలు, ప్రజలు, బాధితులు, బీసీ వర్గాల ఉద్యోగులు, జాతీయ బీసీ కమీషన్ లో అన్ని రకాల వ్యవహారాలపై పిర్యాదులు /వినతి పత్రాలు ఇవ్వటానికి అవకాశం ఉందని చెప్పారు.ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ జర్నలిస్టు