తమిళనాడు రాష్ట్రంలో గల హోసూరులోని ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీ జరిగింది. ఈ కేసుకు సంబంధించి నలుగురు దోపిడీ దొంగలను సైబరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకొని భేష్ అనిపించుకున్నారు. ఇటీవల జరుగుతున్న నేరాలను ఎప్పటికప్పుడు నూతన పుంతలు తొక్కుతూ రాష్ర్ట పోలీసులు వెనువెంటనే కొలిక్కి తీసుకురావడంలో సఫలమవుతున్నారు.
తమిళనాడు నుంచి హైదరాబాద్, కర్ణాటకకు పారిపోయేందుకు దోపిడీదారులు ప్రయత్నించారు. కాగా సైబరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో దోపిడీ దొంగలను అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పెద్ద మొత్తంలో చోరీ చేసిన సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తమిళనాడు, తెలంగాణ మీదుగా కర్ణాటక పారిపోయేందుకు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ దొంగలు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సమాచారం అందుకున్న సైబరాబాద్ పోలీసులు అప్రమత్తమై వారిని అరెస్టు చేశారు.