తమిళనాడు గవర్నర్ భన్వారీలాల్ పురోహిత్ కు కరోనా సోకింది. దాంతో ఆయనను కావేరీ ఆసుపత్రిలో చేర్చారు. ప్రస్తుతం ఆయనకు వైరస్ లోడ్ చాలా తక్కువగా ఉందని డాక్టర్లు తెలిపారు.
ఆయనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని కూడా ఆసుపత్రి ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ డాక్టర్ అరవిందన్ సెల్వరాజ్ తెలిపారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయన వెల్లడించారు.