విజయనగరం ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో తరంగ గానం నిర్వహిస్తోంది.. ఆ కళాశాల. భజన సంప్రదాయంపై నేటి తరం యువతకు అవగాహన కల్పించే నిమిత్తం స్థానిక మహారాజ ప్రభుత్వ సంగీత, నృత్య కళాశాలలో వారం రోజుల పాటు తరంగ గానం పేరుతో ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ వి. ప్రసన్న కుమారి తెలిపారు.
జూన్ 6 నుంచి 12వ తేదీ వరకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు ఒంగోలు వాసి ప్రముఖ గాత్ర విద్వాంసులు గోరకవి శ్రీ కృష్ణ కాంత్ కుమార్ ఆధ్వర్యంలో ఈ వర్క్ షాప్ జరుగుతుందని పేర్కొన్నారు. సంగీత పరిజ్ఞానం ఉన్న విద్యార్థులతో పాటు, సంగీత జ్ఞానం లేని వారు కూడా ఈ వర్క్ షాప్ లో పాల్గొనవచ్చని సూచించారు.
జిల్లా కలెక్టర్ సూచనల మేరకు వీలైనంత మంది యువతకు భజన సంప్రదాయంపై అవగాహన కల్పించటంలే లక్ష్యంగా నిర్వహించే ఈ కార్యక్రమం 6వ తారీఖు సాయంత్రం 4 గంటలకు ప్రారంభం అవుతుందని తెలియజేశారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.