నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం డిప్యూటీ తాసిల్దార్ జయలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జయలక్ష్మి కలెక్టరేట్ కార్యాలయంలో సి బ్లాక్ లో ఇంచార్జ్ సూపరింటెండెంట్ గా విధులు నిర్వహిస్తున్నది. తిమ్మాజీపేట మండలం మారేపల్లి గ్రామం లో ఓ వివాదంలో ఉన్న భూమి విషయంలో వెంకటయ్య అనే వ్యక్తి నుంచి లంచం తీసుకున్నది.
పట్టాను తనపేరుపై మార్చేందుకు ఆమె 13 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. దాంతో మారేపల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశాడు. అవినీతి నిరోధక శాఖ అధికారులు ఈ సాయంత్రం ఒక లక్ష రూపాయలు డిప్యూటీ తాసిల్దారు జయలక్ష్మి కి ఇవ్వమని చెప్పడంతో అతను ఇవ్వబోతుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.