మృతుడి కుటుంబానికి సాయం అందించిన ములుగు, భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సహృదయాన్ని చాటుకున్నారు. వెంకటాపూర్ మండల కేంద్రానికి చెందిన అన్నెబోయిన పవన్ ఇటీవలే మరణించారు. విషయం తెలుసుకున్న తస్లీమా వెళ్ళి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి, చిత్ర పటానికి పూలతో నివాళులర్పించారు. యువకుడు పవన్ మరణం బాధాకరమని, మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఇలాంటి సందర్భంలోనే ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులను తస్లీమా ఓదార్చారు. సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ ఆధ్వర్యంలో 50 కేజీల బియ్యం అందించి సహృదయాన్ని చాటుకున్నారు. తస్లీమా వెంట సర్వర్ చారిటబుల్ ట్రస్టు & ఫౌండేషన్ సభ్యులు ,గ్రామస్థులు ఉన్నారు.
previous post