ములుగు జిల్లా వాజేడు మండలం బొల్లారం గ్రామానికి చెందిన శ్యామల శ్రీకాంత్ గత మూడు సంవత్సరాల క్రితం అనుకొని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికి పరిమితం అయ్యారు. సహాయం కోసం తస్లీమాని సంప్రదించగా వెంటనే స్పందించి వారికి ప్రతీ నెల రూ.2000 ఆర్థిక సహాయం తో చేయుతను ఇస్తున్నారు.
తస్లీమా దంపతుల పెద్దకుమారుడు సమన్ పుట్టినరోజు ఆగస్టు 15 సందర్భంగా నేడు 5200 విలువగల గాలి మెత్తపరుపు, ఆరోగ్య ఖర్చుల నిమిత్తం కొంత ఆర్థిక సహాయం అందించారు. అనంతరం సబ్ రిజిస్త్రార్ తస్లీమా మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ తమకు తోచినంత పేదరికం లో వున్నవారికి సహాయం చేయడానికి ముందుకు రావాలని అన్నారు.
కార్యక్రమంలో నుగుర్ వెంకటపూర్ సర్పంచి యామిలి ఉప సర్పంచ్ భాగ్యలక్ష్మి ఫౌండేషన్ సభ్యులు నరేందర్, ఇసార్ఖాన్, నందనవేని హరికృష్ణ, లావుడ్య సుఖ్రాం, సాయి తేజ,పవన్ కుమార్,నరసింహులు, తదితరులు పాల్గొన్నారు.