బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై ఆ దేశ రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రంగా స్పందించారు. హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని ఆమె అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు హిందువుల భద్రతకు భరోసా కల్పించాలని ఆమె కోరారు. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్లో జరిగిన హింసలో నిరాశ్రయులైన, ఏడుస్తున్న వ్యక్తుల చిత్రాలను కూడా ఆమె ట్వీట్తో జత చేశారు.
హిందువులపై దాడి చేయడం పట్ల సిగ్గుపడుతున్నానని తస్లీమా నస్రీన్ ట్వీట్ ద్వారా తెలిపారు. ఇండ్లు తగలబడిపోవడం, కూల్చివేయడంతో వందలాది మంది హిందువులు నిరాశ్రయులయ్యారని ఆమె విచారం వ్యక్తం చేశారు. నా దేశం ఏడుస్తున్నదని మరొక ట్వీట్లో రాశారు. ఈ ట్వీట్లలో హిందువుల దేవతలను ధ్వంసం చేసిన తీరును, కూల్చివేసిన మండపాల ఫొటోలను కూడా తస్లీమా షేర్ చేసింది.
previous post