33.7 C
Hyderabad
February 13, 2025 20: 19 PM
Slider కృష్ణ

స్టార్ హోటల్స్ అనుకూల ఎక్సైజ్ పాలసీ కావాలి

#cbn

రాష్ట్రంలోని స్టార్ హోటల్స్ కు అనుకూలమైన ఎక్సైజ్ పాలసీని అమలు చేయాలని ఏపీ హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి కోరారు. ఏపీ హోటల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి, తాజ్ గేట్ వే అధినేత రాజయ్య, మురళీ ఫార్సూనర్ అధినేత ముత్తవరపు మురళీ లు రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. నారా చంద్రబాబు నాయుడును శుక్రవారం రాత్రి సీఎం నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు ఆర్ వి స్వామి సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి పలు విషయాలను తీసుకువచ్చారు.

పక్క రాష్ట్రాలైన తెలంగాణా, తమిళనాడు, కేరళ, కర్ణాటక, మహారాష్ట్ర లో అమలవుతున్న ఎక్సైజ్ పాలసీ జీవో లను చూపించి, మన రాష్ట్రంలో ఏడాదికి ఎక్సైజ్ ఫీజు రూ. 68 లక్షలు ఉందని సవరించాలని కోరారు. అలాగే రన్నింగ్ లో ఉన్న హోటల్స్ కు ఇండస్ట్రీ స్టేటస్ అమలు చేయాలని, విద్యుత్ రేట్లు తగ్గించాలని అలాగే మున్సిపల్ టాక్స్ లు తగ్గించాలని కోరారు. హోటల్స్ అసోసియేషన్ వారి విజ్ఞాపనలను విన్న సీఎం నారా చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. హోటల్స్ యాజమాన్యాలకు ఇబ్బంది లేకుండా ఎక్సైజ్ పాలసీని అమలు చేస్తామని హామీ ఇచ్చారు.

Related posts

హైదరాబాద్‌లో అధ్యయనానికి కోవిడ్ 19 బృందం

Satyam NEWS

వదల బొమ్మాళీ: ఏపి ఆర్ధిక స్థితిపై ప్రధానికి రఘురామ ఫిర్యాదు

Satyam NEWS

కర్నూలు సమీపంలో రోడ్డు ప్రమాదం: ముగ్గురి మృతి

Satyam NEWS

Leave a Comment