30.7 C
Hyderabad
April 19, 2024 08: 00 AM
Slider ప్రకాశం

దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి

#ycp

మార్కాపురం నియోజకవర్గం తెదేపా నేత కందుల రామిరెడ్డి నిన్న వై.ఎస్ వివేకానంద హత్య కేసుకు సంబంధించి   ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్  రెడ్డి పై చేసిన అసత్య ఆరోపణలు మానుకోవాలని సూర్య ప్రకాశ్ రెడ్డి హితవు పలికారు. 2019 ఎన్నికలకు ముందు తెదేపా అధినేత సిబిఐనీ రాష్ట్రంలో దర్యాప్తు చేపట్టకుండా  చంద్రబాబు నాయుడు అడ్డుకున్నారని గుర్తు చేశారు. కానీ మా ముఖ్యమంత్రి కేసు దర్యాప్తు కు సహకరిస్తానని ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. ఈ విషయం మరిచిపోయి తెదేపా నేత చౌకబారు మాటలు మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా టీడీపీ దిగజారుడు రాజకీయాలు మానుకోవాలి అన్నారు.

వైసిపి పార్టీ నాయకులు కార్యకర్తలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన ఆరోపణలపై స్పందించిన ఆయన ముఖ్యమంత్రి స్థాయిలో ఆయన మాట్లాడిన మాటలు సరైనవి కావని వాటిని ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. రాజకీయాలు వేరు సినీ అభిమానం వేరు అన్న ఆయన రాబోయే ఎన్నికల్లో వైసిపి 175 నియోజకవర్గాల్లో విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts

బీజేపీని వీడిన కరీంనగర్ జిల్లా మహిళా నాయకులు

Satyam NEWS

బదిలీలకు మ్యాన్యువల్ కౌన్సిలింగ్ నిర్వహించాలి

Satyam NEWS

విజయనగరం లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్

Satyam NEWS

Leave a Comment