రాష్ట్రంలో రైతులంతా ఇబ్బంది పడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదుకోవడం లేదని తెలుగుదేశం నాయకులు మొసలి కన్నీరు కారుస్తున్నారని గుంటూరు జిల్లా వైసిపి నాయకులు అన్నారు. రొంపిచర్ల మండల జెడ్పిటిసి పిల్లి ఓబుల్ రెడ్డి మాట్లాడుతూ రైతుల మీద ప్రేమ ఉన్నట్టు నరసరావుపేట టీడీపీ ఇన్ చార్జి డాక్టర్ అరవిందబాబు పలికే మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయని అన్నారు.
జగనన్న వచ్చిన దగ్గర్నుంచి పంటలు బాగా పడుతున్నాయి ప్రకృతి సహకరించింది రైతుకు విత్తన దగ్గర్నుంచి పంట అమ్ముకునే వరకు ప్రతి రైతు కి మంచి జరుగుతుందని ఆయన అన్నారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి దేశంలో చంద్రబాబునాయుడు ఒక్కడే అని అందరికి తెలుసు అని ఆయన అన్నారు. నరసరావుపేట జడ్పిటిసి పదమొత్తం చిట్టి బాబు మాట్లాడుతూ అరవింద్ బాబు రైతులపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
రొంపిచర్ల మండలం ఎస్సీ సెల్ నాయకులు గుండాల వెంకటేష్ మాట్లాడుతూ అరవింద్ బాబు వట్టి మాటలు ఆపేసి, ముందు ఇంచార్జి పదవిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేసుకొండి అని అన్నారు. ఈ కార్యక్రమంలో పచ్చవ రవీంద్ర బాబు వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.