రాష్ట్రవ్యాప్తంగా జరిగిన నీటి సంఘాల ఎన్నికలలో టీడీపీ మిత్రపక్షాల కూటమి ఘన విజయం సాధించింది. మొత్తం 6,149 సాగునీటి సంఘాల ఎన్నికలకు గానూ 5,946 సంఘాలకు ఎన్నికలు ముగిశాయి. వీటిలో 95 శాతం సంఘాలను కూటమి గెలుచుకుంది. ఛైర్మన్, వైస్ ఛైర్మన్ల ఎంపిక ప్రక్రియ పూర్తైంది. సాగునీటి సంఘాల అధ్యక్షులు డిస్ట్రిబ్యూటరీ కమిటీల ఛైర్మన్లను ఎన్నుకోవాల్సి ఉంది. పులివెందుల నియోజకవర్గంలోని మొత్తం 32 సంఘాలను టీడీపీ కైవసం చేసుకుంది.
previous post
next post