ధరలు తగ్గాలంటే ఇటు జగన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వానికి, అటు మోడీ కేంద్ర ప్రభుత్వానికి రేపు జరిగే తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో గుణపాఠం చెప్పాలని రాష్ట్ర టిడిపి కార్యదర్శి గాజుల ఖాదర్ భాషా ఓటర్ల కు విజ్ఞప్తి చేశారు.
పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయనసోమవారం కడప జిల్లా రాయచోటి నుంచి రేణిగుంట కెళ్ళి పట్టణంలో, పట్టణ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటు వేయాలని, పనబాక లక్ష్మి ని అత్యధిక ఓట్లతో గెలిపించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా గాజుల ఖాదర్ భాష మాట్లాడుతూ నిత్యావసర ధరలు తగ్గాలంటే అది ఒక చంద్రబాబు తోనే సాధ్యమని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తో సాధ్యం కాదన్నారు. రెండేళ్ల వైసీపీ ప్రభుత్వం లో రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారని గాజుల ఖాదర్ భాషా ఆరోపించారు.
ఒక కుటుంబం పై 2.50 లచ్చ భారము మో పరాన్నరు ఇసుక జగన్ రెడ్డి పాలనలో ఐదు వేల రూపాయలకు ఒక ట్రాక్టర్ ఇసుక అని అదే తెలుగుదేశం ప్రభుత్వంలో కేవలం పదిహేను వందల రూపాయలకే ఇంటి వద్దకు వచ్చి ట్రాక్టర్ ఇసుక దిగిపోయేదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.
రాష్ట్రాన్ని మద్యపాన నిషేధం అని చెప్పి ఈరోజు మద్యం ఏరులై పారుతుంది, అది కూడా నకిలీ బ్రాండ్లతో మద్యం ప్రియుల ప్రాణాలతో చెలగాటమాడుతుందన్నారు. ఒకపక్క వ్యవసాయ మోటార్లకు మీటర్లు పోవాలంటే జగన్ రెడ్డి ని ఓడించాలని అన్నారు.
ఈ ఎన్నికే జగన్ రెడ్డి రాష్ట్రప్రభుత్వానికి, మోడీ కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం కావాలన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి రాష్ట్రాన్ని కాపాడాలని రేణిగుంట ఓటర్లను అభ్యర్థిం చారు. ఈ కార్యక్రమంలో క్లస్టర్ అబ్జర్వర్ వేణు, రమణ, రవి, హేమ, ప్రవీణ్, మణి తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు