37.2 C
Hyderabad
April 19, 2024 12: 10 PM
Slider ప్రత్యేకం

రాష్ట్రంలో నడుస్తున్నది తుగ్లక్ పాలన: అయ్య‌న్న ఆరోప‌ణ‌

#ayyannapatrudu

రాష్ట్రంలో తుగ్ల‌క్ పాల‌న‌…రెడ్డిల రాజ్యం న‌డుస్తోంద‌ని  టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు విమ‌ర్శించారు. ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఏం చెబితే..అదే వేద‌మ‌ని..ఆ  తుగ్ల‌క్ సీఎం ఆదే వింటాడ‌ని ఆరోపించారు. గ‌నుల త‌వ్వ‌కమైనా..స్టీల్ ప్లాంట్..వేల‌మైనా…ఐటీ సెక్టార్ విశాఖ‌కు తేవాల‌న్న‌..అంతా విజ‌య‌సాయిరెడ్డి ఆదేశాల‌తోనే  సీఎం జ‌గ‌న్….పాల‌న జ‌రుగుతోంద‌న్నారు.

గ‌డ‌చిన మూడేళ్ల నుంచీ…రాష్ట్రాన్ని…దాదాపు మూడువేల కోట్ల  అప్పులోకి నెట్టేసిన  ఘ‌న‌త సీఎం  జ‌గ‌న్ దేన‌ని అయ్యన్న పాత్రుడు  ధ్వ‌జమెత్తారు.అన్ని రంగాల‌ను నిలువ  దోపిడీ  చేసార‌ని..ఆఖ‌రికి బ్రాందీ  రేటు  భారీగా  పెర‌గ‌డానికి కార‌ణం  నువ్వు  కావా అంటూ ప్రశ్నించారు.న‌ర్సీప‌ట్నంలో  నా  ఇంటిని బ‌ల‌వంతంగా పోలీసుల‌చే కొ్ట్టించిన  ఘ‌న‌త  ఎంపీ  విజ‌య‌సాయిరె్డ్డిదేన‌ని అయ్య‌న్న ఆరోపించారు.త‌న ఇంటిని…న‌న్ను ప‌రామ‌ర్శించేందుకు…అశోక్ గ‌జ‌ప‌తిరాజు వ‌స్తానంటే..మీరు రావొద్ద‌ని నేనే వ‌వ్తాన‌ని చెప్పి…ఆయ‌న‌న్ను క‌లిసాన‌ని విలేక‌రుల‌తో  అయ్య‌న్న పాత్రుడు చెప్పారు.

Related posts

ఫిషింగ్ హార్బర్ కంటైనర్‌ టెర్మినల్‌ వద్ద మత్స్యకారుల ఆందోళన

Satyam NEWS

అయోధ్యలో పెద్ద ఎత్తున హోటళ్లు పెడుతున్న OYO

Satyam NEWS

ఏడేళ్ల కాలంలో రాష్ట్రంలో విద్యాభివృద్ధికి 1 లక్ష 87 వేల కోట్ల ఖర్చు

Bhavani

Leave a Comment