కృష్ణా జిల్లా ఉయ్యూరు టౌన్ 16 వార్డు లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈడే అంజిబాబు ఆధ్వర్యంలో వార్డు ప్రజలకు కోడి గుడ్డులు, పాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గా ఎమ్మెల్సీ యలమంచిలి బాబు రాజేంద్రప్రసాద్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు అంజి బాబు ప్రోటీన్ ఆహారమైన గుడ్డు, పాలు పంచడం అభినందనీయమని అన్నారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అవగాహన పెంచుకుని వైద్యులు సూచించే సలహాలను పాటించాలని, వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల శుభ్రత ప్రజలందరూ పాటించాలని రాజేంద్రప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజులపాటి ఫణి కుమార్, అరేపల్లి సుబ్బారావు, చాలపాటి శ్రీనివాసరావు, జంపాన తేజా, హనుమాన్ నగర్ యూత్, కాటురు రోడ్ ఫ్రెండ్స్ సర్కిల్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.