28.7 C
Hyderabad
April 20, 2024 07: 16 AM
Slider గుంటూరు

వైసీపీ సైకోలకు సరైన వైద్యం చేసేందుకు మేమున్నాం

#chadalawada

వైసీపీ సైకోలకు సరైన వైద్యం చేసేందుకు తమలాంటి వైద్యులు తెలుగుదేశంలో చాలా మంది ఉన్నారని గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గ టిడిపి ఇన్-చార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు అన్నారు. ప్రభుత్వ ఉగ్రవాదం పై పోరు చంద్రబాబు దీక్షకు ఆయన తన మద్దతు వ్యక్తం చేశారు. డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో భారీ కాన్వాయ్ తో పెద్ద సంఖ్యలో బయలుదేరి వెళ్లి దీక్షకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా అరవింద బాబు మాట్లాడుతూ కొద్ది రోజులు ఓపిక పట్టండి… వచ్చేది మన ప్రభుత్వమే అని అన్నారు.  ప్రస్తుతం రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుందని, ఇది ఎక్కువ రోజులు సాగదని ఆయన అన్నారు. చాలా నియోజకవర్గాల్లో, గ్రామాలలో వైసిపి నాయకులు, వాలంటీర్లు టీడీపీ పార్టీ కార్యకర్తలను బెదిరిస్తున్నారని, అలాంటి వాటికి టిడిపి కార్యకర్తలు,నాయకులు బెదరావాల్సిన పనిలేదని ఆయన అన్నారు.

తనను ఏమైనా అంటే తన అభిమానులకు కోపం వస్తుంది, ఇలాగే దాడులు చేస్తారని సీఎం కుర్చీలో కూర్చొని జగన్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటు అని ఆయన విమర్శించారు. ‘‘ మరి నీ పై కోడి కత్తితో దాడి చేసిన వ్యక్తి పై మీ అభిమానులు ఎందుకు దాడి చేయలేదు?’’ అంటూ అరవిందబాబు సూటిగా ప్రశ్నించారు. మీ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి ని దారుణంగా హత్య చేస్తే మీ అభిమానులకు కోపం రాలేదా అని కూడా ఆయన ప్రశ్నించారు.

జగన్ రెడ్డి ఓ నియంత, అతని అనుచరులు అంతా సైకోలు.. జగన్ ఓ డ్రగ్ అడిక్ట్…అతని అనుచరులు అంత గంజాయి బ్యాచ్ అని అరవిందబాబు కామెంట్ చేశారు. చంద్రబాబు నాయుడును, లోకేష్ బాబును విమర్శించే నైతిక అర్హత ఈ వైసీపీ ఆర్థిక నేరగాళ్లకు లేదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో గోనుగుంట్ల కోటేశ్వరరావు, నల్లపాటి రాము, వల్లపు నాగేశ్వరరావు, గొట్టిపాటి జనార్ధన్ బాబు, కొట్టా కిరణ్, మానుకొండ జాహ్నవి, బండారుపల్లి విశ్వేశ్వరరావు, వేన్నా బాలకోటి రెడ్డి, మొండితోక రామారావు, మెట్టు వెంకటేశ్వర్ రెడ్డి, ఇమ్మడిశెట్టి కాశయ్య చల్లా సుబ్బారావు, బడే బాబు మరియు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

Related posts

లక్ష్య సాధనతోనే విద్యార్థులకు సమాజంలో గౌరవం

Satyam NEWS

ఎవరితోనూ సఖ్యతగా ఉండని పొన్నూరు ఎమ్మెల్యే

Satyam NEWS

న్యూ డైమన్షన్: భోగి మంటల కోసం గుడిసె తగలబెడతామా?

Satyam NEWS

Leave a Comment